నాడు కాంగ్రెస్ వారు తెలుగు రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా చీల్చివేసారు , చీల్చిన నాడు ఎన్నో హామీలను చేసారు, వేను వెంటగనే కాల గమనం లో కలిపారు. బిజెపి పగ్గాలు చేపట్టగానే విభజన నాటి అన్ని హామీలను నెరవేరుస్తాం అన్నారు. బిజెపి నుండి రాష్ట్రానికి ఏమి సాయం రాకపోగా ఎదురు చీత్కారాలు పక్షపాత వైఖరి బయట పడ్డాయి . అయినా తెలుగు ప్రజలు వేచి చూసారు వేచి చూసారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు ఓర్పుతో,నమ్మకంతో వేచి చూసారు .
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రధాని మోడీ గారు మొదట్లో ఆంధ్ర రాష్ట్రము పై ఎనలేని అభిమానం చూపారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కావాల్సింది మాత్రం చేయలేదు. ప్రత్యెక హోదా రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు ఇపుడు మరి అపుడు అరుణాచల్ ప్రదేశ్ ,అస్సాం ,హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఎన్నో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు అపుడు ఎక్కడికి పోయింది మీ రాజంగా నీతి ? ఎందుకు మీకు తెలుగు వారు అంటే అంత తక్కువ భావం.
కడప కు ఉక్కు కర్మాగారం అన్నారు కానీ పంగ నామం పెట్టి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతొ గుజరాత్ లో 2989 కోట్లు ఖర్చుపెట్టారు, మరి విశాఖలో రైల్వే జోన్ ని తుంగ లో తొక్కారు ఇదెక్కడి న్యాయం ఎక్కడికి పోయింది మీ దర్మం ?650 కిలోమీటర్లు ఉన్న మహారాష్ట్ర కు ప్రకృతి ప్రమాదాల నివారణకు ఇచ్చింది 8915 కోట్లు మరి 970 కిలోమీటర్లు ఉన్న ఆంధ్ర రాష్ట్రనికి మీరు ఇచ్చింది ఏంటి కేవలం 2430 కోట్లు ఇది ఎక్కడి న్యాయం?అయినా సరే తట్టుకుని నిలబడ్డది తెలుగు గడ్డ.
రాయల సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మీరు ఇచ్చే సాయం గుజరాత్ కి కేటాయించిన బడ్జెట్ లో ఎన్నో వంతు ? మోడీ జీ ఎన్నడూ ఆంధ్ర లో కాలు మోపలేదు కానీ నీకు ఆంధ్ర రాజకీయాల్లో పట్టు కావాలి, ఇంకా ఇక్కడ ఎవరి పొట్ట కొట్టాలో మీకే తెలియాలి ? పది సంవత్సరాల ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ అని నమ్మబలికావ్, ఎన్ని అవమానాలు,అవ హేళనలు చేసిన అభిమానం తో ఆహ్వానించాం. నమ్మిన వారి నే నాశనం చేయాలనీ చూస్తున్నావ్ ఇక ఊరుకోము. నువ్ ఇచ్చే సాయం కోసం మేము చేతులు చాపి అడగవల్సిన అవసరం మాకు లేదు ప్ర్తత్యేక హోదా మా హక్కు దాని సాధించు కుని తీరుతాం.
నాడు ఢిల్లీ పెద్దలు చేస్తున్న అన్యాయాలను అక్రమాలను చూసి గర్జించిన ఒక తెలుగు సింహం ఎన్టీఆర్ ఆ దెబ్బ ఇప్పటికి ఢిల్లీ లోని చాల మంది కి తెలుసు. ఇప్పుడు మీరు చేస్తున్న అన్యాయాలను అక్రమాలను బరిచే శక్తీ నశించి పోయింది నీ నక్క జిత్తుల బుద్ధి బయట పడింది. ఎందుకు నీకు తెలుగు వారు అంటే భయం ? ఇక ఉరుకోము మీ మెడలు వంచి మరి మా హక్కులను మేము సాదించుకుంటాం.
రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రనికి గొప్ప రాజధాని నిర్మాణం లో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ని అరచేతి లో స్వర్గం చూపించే మాటలకూ అంతులేదు కానీ అది చేతిలోకి వచ్చే సరికి పొంతూ లేదు. మా నాయకుడు నారా చంద్ర బాబు నాయుడు గారు ఎంతో ఓర్పుతో సంయమనం పాటించారు కానీ మీరు ఆ సహెన్నాని చేతకాని తనం అనుకుంటూ నారు కానీ తిరగ బద్ద తెలుగు వాడి దెబ్బ తగిలితే తట్టుకునే శక్తీ మీకు మా బిజెపి ప్రభుత్వానికి ఉందా??
అడిగి అడిగి అలసి పోయాం , ఆశలు అడుగంటినాయి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం చూపుతున్న పక్షపాత వైఖరిని ఎండా గడుతూ ఆంధ్రు ల హక్కు అయినా ప్రత్యేక హోదా సాధన కోసం రేపు వాక్ ఫర్ ఏపి ని నిర్వహిస్తునారు . రా కదలి రా మన అడుగుల చప్పుడు కేంద్రం నాయకుల గుండెలో మరు మ్రోగాలి వారి ఢిల్లీ పీఠాలు దద్దరిల్లే లా రా కదలి రా తెలుగు వాడిగా రా మన చెంద్రన్నకు చేదోడుగా రా ..... మన హక్కుల సాధన కై రా కదలి రా . మన ఆంధ్ర రాష్ట్రన్ని అభివృద్ధి లో అగ్రగామి గా నిలిపి రాబోయే తరాలకు జీవితాలకు భరోసాను కలిపిద్దాం. జై తెలుగు తల్లి .... జోహార్ ఎన్టీఆర్.... జై చంద్ర బాబు...
పోరాడితే పోయేది ఏమిలేదు బానిస సంకెళ్లు తప్ప.... రా కదలి రా
0 Comments