కడప ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులు |
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిధుల ద్వారా ఈ చెల్లింపులు |
2015-16 సంవత్సరంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఫాతిమా వైద్య కళాశాలను అనర్హత కింద నిషేధించారు. తమ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో విద్యార్థులు చేసిన పోరాటం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. దాంతో చొరవ తీసుకున్న చంద్రబాబు 2018 నీట్లో అర్హత సాధించి ‘బి’ కేటగిరిలో చేరినట్లయితే ఆ విద్యార్థులకు రెండేళ్ల పాటు ఈ రూ.13కోట్ల నుంచి ఫీజు చెల్లించడానికి నిర్ణయించారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల అంశాన్ని ప్రత్యేక కేసు కింద ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిధుల ద్వారా ఈ చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రెండు సంవత్సరాల ఫీజు కింద రూ.13 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. |
తదుపరి పరిణామంలో నీట్ లో ఉత్తీర్ణత సాధించిన 42 ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల రెండు సంవత్సరాల ఫీజు కింద రూ.13 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి, చదువులో మంచి ప్రతిభ చూపి ఉత్తీర్ణులై డాక్టర్లుగా జీవితంలో స్థిరపడాలని అన్నారు చంద్రబాబు.
0 Comments